Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 1, 2026Short Read
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొగల్తూరు సభలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వారు (SIR) తర్వాతే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని వైసీపీ అంటోందని, అయితే ప్రజలు ఏకగ్రీవాలను కోరుకుంటే వారిని ఎవరు అడ్డుకోగలరని ఆయన ప్రశ్నించారు.
మున్సిపాలిటీల్లో పార్టీలు మారే నాయకులతో ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ప్రస్తావించారు.
ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలియజేశారు.





